Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాజీ ఎంపీ మిడియం బాబురావు
నవతెలంగాణ-భద్రాచలం
ఆదివాసి బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించాలని భద్రాచలం మాజీ ఎంపీ మిడియం బాబురావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏజెన్సీలో ఉన్న ఆదివాసులు అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్నారని ఆయన అన్నారు. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కేటాయించని పరిస్థితిలో ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధికి ఆదివాసుల బంధు పథకాన్ని ప్రకటించాలని అన్నారు. దళితులకు దళిత బంధు ఇస్తారా లేక ఎన్నికల హామీలలో భాగంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారో తేల్చాలని ఆయన అన్నారు. పేదలను మాయమాటలతో బురిడీ కొట్టించి సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. అదేవిధంగా ఆదివాసీ ప్రాంతాల్లో సరైన రహదారులు ,మంచినీటి సౌకర్యాలు, విద్య, వైద్యం అందడం లేదని ఆయన అన్నారు. ఆదివాసీ ప్రాంతాలలో మెరుగైన వైద్యం అందించే విధంగా ప్రభుత్వం శ్రద్ధ చూపాలని ఆయన అన్నారు. ఏజెన్సీలో డెంగ్యూతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన అన్నారు. ఏజెన్సీ ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి సరియం కోటేశ్వరరావు, కారం పుల్లయ్య, వజ్జా సురేష్, కారం నరేష్, జోగారావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.