Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు సోమయ్య,
జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-ఇల్లందు
ఐద్వా సీనియర్ నాయకురాలు తాండ్ర రాయపోష ఆదర్శ మూర్తి అని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు పి.సోమయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య లు అన్నారు. స్థానిక వినోబా భావే కాలనీలో పార్టీ మాజీ పట్టణ కమిటీ సభ్యులు, ఐద్వా సీనియర్ నాయకురాలు తాండ్ర రాయపోష సంస్మరణ సభ దేవులపల్లి యాక య్య అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి వారు హాజరై మాట్లా డుతూ పార్టీ నిర్బంధాలు ఎదుర్కొన్న కాలం నుండి పార్టీ అభివృద్ధి కోసం పనిచేశారని, మహిళా సమస్య లపై అనేక పోరాటాలు చేశారన్నారు. అనంతరం ఐద్వా జిల్లా కార్యదర్శి జ్యోతి మాట్లాడుతూ పార్టీ క్రమశిక్షణ వల్ల కుటుంబం కోసం తన జీవితాన్ని కూడా ధారపోసిన ఉత్తమురాలు రాయపోష అన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ నబి, రవి, కృష్ణ, మన్యం మోహనరావు, జైబున్నిస, లక్ష్మీ, వెంకట నరసయ్య, సర్వన్ పాసి, రాందాస్, మాదా రపు వెంకటేశ్వర్లు, లక్క రాజేశ్వరరావు, రాము, అభిమన్యు, అఫ్సర్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.