Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐదుగురికి తీవ్ర గాయాలు ...తొమ్మిది మందికి స్వల్ప గాయాలు
నవతెలంగాణ-బోనకల్
ఆగి ఉన్న ఆటోను ట్యాంకర్ ఇంజను ఢకొీన్న ప్రమాదంలో ఐదుగురు కూలీలకు తీవ్ర గాయాలు, మరో 9 మందికి స్వల్ప గాయాలు అయిన సంఘటన సీతానగరం గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... వైరా మండలం అష్టగుర్తి గ్రామానికి చెందిన నారపోగు వెంకటేశ్వర్లు తన పొలంలో వరి నాటు కోసం ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం గొల్లపూడి గ్రామానికి చెందిన 14 మంది కూలీలను అక్కడ నుంచి ఆటోలు తీసుకువచ్చారు. పొలంలో నాటు వేసిన అనంతరం తిరిగి అదే ఆటోలు వ్యవసాయ కూలీలు బయలుదేరారు. సీతానగరం రోడ్డు పక్కన ఆటో నిలుపుకొని ఉన్నారు. అదే సమయంలో మంగళవారం ఉదయం వైరా మండలం సోమవారం వద్ద ప్రమాదానికి గురైన ట్యాంకర్ ఇంజన్ అక్కడ నుంచి జగ్గయ్యపేట వైపు బయలుదేరింది. సీతానగరం వద్ద కూలీలతో ఆగివున్న ఆటోను ట్యాంకర్ ఇంజన్ ఒక్కసారిగా వచ్చి ఢకొీట్టింది. ఆ సమయంలో ఆటోలో 14 మంది కూలీలు ఉన్నారు. ఇందులో ఐదుగురు తీవ్రంగా గాయపడగా తొమ్మిది మందికి స్వల్పగాయాలయ్యాయి.క్షతగాత్రులను 108లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు సంఘటన స్థలాన్ని ఎస్ఐబి కొండలరావు సందర్శించారు సంఘటన జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.