Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
పోలవరం ముంపు మండలాల పర్యటనలో భాగంగా, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ బాబు భద్రాచలం సీతారామచంద్రస్వామి వారిని మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, ఆశీర్వచనం, స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఆలయ విశిష్టతని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బక్కని నరసింహులు, భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య, మహబూబాబాద్ తెలుగుదేశం పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షులు కొండపల్లి రాంచంద్రరావు, తెలుగురైతు రాష్ట్ర అధ్యక్షులు కాపా కృష్ణమోహన్, మాజీ హౌం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎంఎల్సిలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.