Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బోనకల్ : మెకానిక్ల సమస్యల పరిష్కారం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మెకానిక్ల సంఘం జిల్లా ఇన్చార్జి షేక్ మస్తాన్ కోరారు. మండల కేంద్రంలో మెకానిక్ల సంఘం మండల మహాసభ ఎలగందుల కృష్ణ అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మెకానిక్ల సంఘం మండల అధ్యక్షుడిగా అనిల్ రెడ్డి, కార్యదర్శిగా గోగుల రామారావు ఎన్నికయ్యారు. మండల కమిటీ సభ్యులుగా అశోక్, నాగరాజు, జానీ, లక్ష్మణ్, కొండలు, లాలయ్య, గోవిందరావు, సూరిబాబు, సత్యనారాయణ, సలీం లను ఎన్నుకొన్నారు. ఈ మహాసభలో ఖమ్మం టౌన్ అధ్యక్షులు ఎస్ డి షఫీ. నాయకులు నాగుల్ మీరా, నిజాం మండల మెకానిక్ లు తదితరులు పాల్గొన్నారు.