Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
మండలంలో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. పాఠశాలలో విద్యా విధానం, కరోనా నిబంధనల గురించి పాఠశాల ఉపాధ్యాయుల అనుసరిస్తున్న తీరు ఎంఈఓ వీరాస్వామిని అడిగి తెలుసుకున్నారు. గోవిందాపురం పాఠశాలలో టీచర్కు కరోనా రావడంతో వివరాలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో కచ్చితంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విక్రమ్ కుమార్ ని అడిగి మండల పరిస్థితులను, భూరికార్డుల ఆన్లైన్ ప్రక్రియ గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ వినాయ శీల, వీఆర్వోలు, వీఆర్ఏలు పాల్గొన్నారు.