Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నేలకొండపల్లి
ఈనెల 10 నుంచి 17 వరకు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను వాడవాడలా ఘనంగా నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక రావెళ్ల భవనంలో పార్టీ మండల జనరల్ బాడీ సమావేశం నాయకులు ఏటుకూరి రామారావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతులు, కూలీలు, అన్ని వర్గాల ప్రజానీకం ఉద్యమించాలని అన్నారు. సెప్టెంబరు 25న కేంద్రంలో మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ బంద్ ను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి గుడవర్తి నాగేశ్వరరావు, కె.వి.రెడ్డి, పగిడికత్తుల నాగేశ్వరరావు, దుగ్గి వెంకటేశ్వర్లు, భూక్య కృష్ణ, మందడి కోదండ రామారావు, శాఖా కార్యదర్శులు షేక్ లాల్ పాష, మందడపు మురళీకష్ణ, రాసాల నవీన్, శివరాజు, దండా సూర్యనారాయణ, వెంకటరత్నం, మారుతి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.