Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గాంధీచౌక్
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ నేతృత్వంలో వారి సూచనల మేరకు పలు ప్రభుత్వ భవనాలపై స్ట్రీట్ ఆర్ట్స్తో పాటు పలుచోట్ల నగర విధులను అద్భుతంగా సుందరీకరణ చేశారు. తెలంగాణలో ఖమ్మం నగరాన్ని స్ట్రీట్ ఆర్ట్ కు చిహ్నంగా ఉంచాలనే మంత్రి పువ్వాడ అజరు కుమార్ సంకల్పంకు అనుగుణంగా ఖమ్మం నగరంలోని 15కు పైగా ప్రభుత్వ భవనాలపై అందమైన, అద్భుతమైన, అర్థవంతమైన పెయింటింగ్స్ వేసి వాటితో జీవితం ఉట్టిపడేలా ప్రజలకి కనులవిందుగా ఉండాలని మంత్రి సూచనలతో వారి విజన్కు తగినట్టుగా ఆర్టిస్టులు తీర్చిదిద్దారు.