Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం గిడుగు రామ్మూర్తి పంతులు స్మారక పురస్కార కార్యక్రమం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ కవి రచయిత విశ్లేషకులు ఉపాధ్యాయులు కోంపెల్లి రామయ్యకు తను రాసిన ''గుండె చప్పుడు'' కవితా సంపుటికి గాను సాహిత్య రంగంలో గిడుగు రామ్మూర్తి పంతులు స్మారక పురస్కారం కళారత్న అవార్డు దక్కింది. ఈ అవార్డును బిక్క కృష్ణ, గిడుగు కాంతి కృష్ణ, తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జి.చంద్రయ్య, విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి బి.చంద్రకుమార్, ఎంఎల్సి, కవి గాయకుడు గోరేటి వెంకన్న, ఆంధ్ర ప్రభ సంపాదకులు వై.ఎస్.శర్మ, శతచిత్ర నిర్మాత టి.రామసత్యనారాయణ, ప్రముఖ సంఘ సేవకురాలు అనూహ్య రెడ్డి, ప్రముఖ రచయిత్రి భాషా పరిశోధకురాలు రాజా వాసి రెడ్డి మలీశ్వరి తదితరుల చేతుల మీదుగా రామయ్య అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వికాస వేదిక అధ్యక్షులు సాధనాల వెంకటస్వామి నాయుడు ప్రధాన కార్యదర్శి లెనిన్ శ్రీనివాస్, బుక్కా సత్యనారాయణ, మలిశెట్టి కృష్ణ మూర్తి, గాజుల భారతి శ్రీనివాస్, యడవల్లి శైలజ, తాళ్ల యోగానందం, భూక్య హచ్యా, జహీరోద్ధిన్, మద్ధం రమణ మూర్తి, అంగోతు జయ వాసు, హుస్సేన్, గోవింద్, రేళ్ళ శ్రీనివాస్, శోభనాద్రి, సీత్లనాయక్, పాఠశాల ఉపాధ్యాయులు కోంపెల్లి రామయ్యను ప్రత్యేకంగా అభినందించారు.