Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కరకగూడెం
మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా మొహమ్మద్ ఫారూఖ్ని ఆదివారం ఏకగ్రీవంగా మండల పాత్రికేయులు ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా మొహమ్మద్ ఫారూఖ్ (సాక్షి ), గౌరవ అధ్యక్షునిగా తిప్పని శ్రీనివాసరావు (ఆంధ్రజ్యోతి), ఉపాధ్యక్షునిగా గనగాని ప్రవీణ్ (నమస్తే తెలంగాణ) కార్యదర్శిగా ఇల్లేందుల సురేష్ (మనం), కోశాధికారిగా కొనకండ్ల సాయి కిరణ్ (నవతెలంగాణ), సంయుక్త కార్యదర్శిగా దుర్గం ప్రేమ కుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడు ఫారూఖ్ మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని విలేకర్లకు సహాయసహకారాలు అందజేస్తానని అన్నారు.