Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
మండల పరిధిలోని తాళ్లూరు, వెంకటాపురం గ్రామాల మధ్య ఊర చెరువు అలుగు వద్ద ఉన్న చప్టా వరదలకి దెబ్బతిన్నదని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని సిపిఎం గ్రామశాఖ డిమాండ్ చేసింది. తాళ్లూరు నుండి వెంకటాపురం వెళ్లే రహదారి ఊర చెరువు అలుగుకి దగ్గరగా ఉండటంతో ఇటీవల వచ్చిన వరదలకు రెండు కానలు పూర్తిగా దెబ్బతిన్ని రంధ్రాలు పడ్డాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారని సిపిఎం మండల నాయకులు ముదిగోండ్ల అంజయ్య, గ్రామ శాఖ కార్యదర్శి బత్తిన కృష్ణ, నాయుడుచంద్రరావు తెలిపారు.