Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రఘునాధపాలెం
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ తెలిపారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాధ పాలెం మండలంలో మంగళవారం ఇంటింటికి వెళ్లి కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి స్వయంగా 32 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పటివరకు 5 వేల మందికి పైగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా సుమారు 50 కోట్ల రూపాయలను అందించినట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు, జడ్పిటిసి మాలోతు ప్రియాంక, ఎంపీపీ భూక్యా గౌరీ, సుడా డైరెక్టర్ వీరు నాయక్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొంటె ముక్కల వెంకటేశ్వర్లు, మండల ప్రత్యేకాధికారి ఏ.విజయ కుమారి, తహశీల్దార్ జి.నరసింహారావు, ఎంపీడీవో రామకృష్ణ పాల్గొన్నారు.