Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జయప్రదం చేయండి : కాసాని ఐలయ్య
నవతెలంగాణ-జూలూరుపాడు
ఈ నెల 27న రైతులు చేపట్టిన భారత్ బంద్ జయప్ర దం చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని అయిలయ్య పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోనీ రైతు సంఘం సమావేశం ఏర్పాటు చేశారు. బానోత్ ఇస్ర అధ్యక్షతన జరిగిన ఈ సభలో కాసాని అయిలయ్య మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు తలపెట్టే దేశ వ్యాప్త బందులో విజయవంతం చేయాలని అన్నారు. ఎంతో కాలంగా రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని కేంద్రం తక్షణమే స్పందించి రద్దు చేయాలని అన్నారు. 27 న జరగబోయే బందులో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అన్నవరపు సత్యనారా యణ, జిల్లా ఉపాధ్యక్షులు బానోతు ధర్మ, మండల నాయకులు పాల్గొన్నారు.