Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లి
సింగరేణి తన లాభాల్లో 35 శాతం వాటా కార్మికులకు ప్రకటించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం సింగరేణి సత్తుపల్లి ఏరియాలో జనరల్ బాడీ సమావేశము బ్రాంచి కార్యదర్శి దారా భీమయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సీతారామయ్య మాట్లాడుతూ సింగరేణిలో అనేక సమస్యలు ఎప్పటినుంచో తిష్టవేసుకుని ఉన్నా, గుర్తింపు కార్మిక సంఘం మాత్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు సింగరేణి యాజమాన్యం సింగరేణి నిధులను ప్రభుత్వానికి ధారాదత్తం చేస్తోందని ఆరోపించారు. సమావేశంలో అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య, మైనింగ్ స్టాఫ్ బాధ్యులు పాల్గొన్నారు.