Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
పెండింగ్ భూ సమస్యలు సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ రెవెన్యూ, అటవీ శాఖ అధికారులను ఆదేశిం చారు. కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో సోమవారం అటవీ, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అటవీ - రెవెన్యూ శాఖల వివాదాస్పద భూములు, సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు మండలాలకు సంబంధించి ధరణీలో నమోదు కాని విస్తీర్ణం, పాస్ పుస్తకాల జారీ తదితర అంశాలపై అధికారులకు పలు ఆదేశాలు చేశారు. సత్తుపల్లి మండలం బేతుపల్లి, పెనుబల్లి మండలం తాళ్ళపెంట, కల్లూరు మండలం రామచంద్రాపురం, లక్ష్మీపురం గ్రామాలలో సర్వేను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆయా గ్రామాలలో ఇంకనూ సర్వే చేయాల్సిన భూ విస్తీర్ణం, జారీ చేయవలసిన పట్టాదారు పాస్ పుస్తకాలు, ధరణీలో నమోదు కావాల్సిన విస్తీర్ణంపై తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ డివిజనల్ అధికారి, ఆయా మండలాల తహశీల్దార్లకు కలెక్టర్ పలు ఆదేశాలు చేశారు. అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, ల్యాండ్ సర్వే ఏడీ వి.రాము, సత్తుపల్లి ఎఫ్.డి.ఓ సతీష్ కుమార్, కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి సూర్యనారాయణ, కల్లూరు, పెనుబల్లి తహశీల్దార్లు మంగీలాల్, రమాదేవి, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.