Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చింతకాని
దళితబంధు పథకం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ అందుతుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. చింతకాని మండలం బొప్పారం, గాంధీనగర్, రామకృష్ణాపురం గ్రామాల్లోని దళితవాడల్లో ఆయన సోమవారం పర్యటించారు. దళితబంధు పథకంపై స్థానికులకు అవగాహన కలిగించారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ అందుతుందని.. దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను భట్టి దృష్టికి తీసుకెళ్లారు. దళితవాడల్లోని పలు గృహాలను ఆయన సందర్శించి సమస్యల గురించి వాకబు చేశారు. దళిత కాలనీలో భట్టికి ఘన స్వాగతం పలికారు. దళితబంధు ప్రతి ఒక్కరికీ అందేలా చూసే బాధ్యత తనదని భట్టి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వరరావు, మండలాధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ తిరుపతి గోవిందరావు, కూరపాటి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.