Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పోడు భూముల సమస్యపై కేబినెట్ సబ్ కమిటీ హైదరాబాదులో భేటీ అయింది. ఈ నెల 18వ తేదీన తొలిసారి భేటీ అయిన కమిటీ మరో మారు శుక్రవారం పోడు సమస్యపై చర్చించింది. కమిటీ చైర్మన్, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ నేతత్వంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి , సంబంధిత అధికారులు బీఆర్ కేఆర్ భవన్ లో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా దీర్ఘకాలికంగా ఉన్న పోడు భూముల సమస్యలపై అవగాహన, పరిష్కారాల అన్వేషణ, సూచనలపై చర్చించారు.