Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి మునిసిపాలిటీ, నియోజకవర్గంలో గొర్రెల పంపిణీలో ఏర్పడిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సోమ వారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సంబంధిత శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అభ్యర్ధించారు. ఈ సందర్భంగా సండ్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టగా సత్తుపల్లి మున్సిపాలిటీలో విలీనమైనటువంటి ప్రాంతాలల్లో అర్హుల దగ్గర్నుంచి అధికారులు అవగాహన లేకుండా డీడీలు కట్టించుకుని తరువాత తిరిగిచ్చేశారని వివరించారు. విలీనమైనటు వంటి ప్రాంతాల్లో కూడా గొర్రెల పంపిణీ జరిగేలా కృషి చేయాలని కోరారు. అదే విధంగా సత్తుపల్లి నియోజకవర్గంలో మొదటి దశ గొర్రెల పంపిణీ పధకంలో పెండింగ్లో ఉన్న యూనిట్లను వెంటనే పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సానుకూలంగా స్పందించిన మంత్రి
సండ్ర అభ్యర్ధనకు మంత్రి తలసాని యాదవ్ సానుకూలంగా స్పందిస్తూ మున్సిపాలిటీ పరిధిలో గొర్రెల పంపిణీ పధకం పరిగణలోనే ఉందని, త్వరలోనే కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు.