Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజావాణి కార్యక్రమానికి గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ డిఆర్ఓను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల దరఖాస్తును స్వీకరించి పరిష్కరించేందుకు ఆయా శాఖలకు అధికారులకు ఎండార్స్ చేసినట్లు చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా అధికారులు మాత్రమే హాజరు కావాలని, తన అనుమతి లేకుండా ఆలస్యంగా వచ్చినా, గైర్హాజరయినా ఉపేక్షించనని హెచ్చరించారు. ముందస్తు తన అనుమతి లేకుండా గైర్హాజరయిన అధికారులకు షోకాస్ నోటీసులు జారీ చేసి వివరణతో తనకు అందచేయాలని డిఆర్ఓకు సూచించారు. ప్రజావాణి కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు సమస్య పరిష్కారం వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ అశోకచక్రవర్తి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.