Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
నవతెలంగాణ-బోనకల్
సీఎం కేసీఆర్ దళితుల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళిత బందు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. మండల పరిధిలోని జానకిపురం గ్రామంలో తేజ ఫంక్షన్ హాల్ లో మండల నాయకులు, గ్రామ అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలులో, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో దేశంలో అగ్రభాగాన ఉన్నారని కొనియాడారు. కెసిఆర్ పరిపాలనలో ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందుతుందన్నారు. అనంతరం నారాయణపురం గ్రామంలో పలు కుటుంబాలను కమల్ రాజు పరామర్శించారు. అదే విధంగా నారాయణపురం నుంచి కలకోట వరకు నూతనంగా నిర్మిస్తున్న రోడ్డును పరిశీలించారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, టీఆర్ఎస్ మండల కార్యదర్శి, నూతన అధ్యక్షుడిని చేబ్రోలు మల్లికార్జున రావు, నూతన మండల కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాదరావు, మాజీ జడ్పీటిసి బానోతు కొండ, బోనకల్ సొసైటీ అధ్యక్షుడు చావా వెంకటేశ్వరరావు, రజక సంఘం జిల్ల్షా అధ్యక్షుడు తమ్మారపు బ్రహ్మయ్య, ఆ పార్టీ నాయకులు తన్నీరు రవి, చావా హనుమంతరావు, కాకాని శ్రీనివాసరావు, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు తదితరుల్ను పాల్గొన్నారు.