Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమలాయపాలెం
బీరోలు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులను మంగళవారం ఎంపీపీ బోడ మంగీలాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య మిషన్ పథకము ద్వారా కాకరవాయి, సుబ్లేడు, మహమ్మదాపురం, బీరోలు, జల్లేపల్లి గ్రామాలకు ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణాలు మంజూరైనట్లు తెలిపారు. ప్రతి భవనంకి 16 లక్షల వ్యయంతో అన్ని రకాల వైద్య సదుపాయాలకు అవకాశం ఉండేటట్లు నిర్మిస్తున్నామని తెలిపారు. ఆరోగ్య కేంద్రం భవనాలను మండలానికి తెప్పించడంలో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సహాయ సహకారాలు ఉన్నాయని తెలిపారు. త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అవసరానుగుణంగా భవనాలు అందించాలని నిర్మాణదారులకు సూచించారు. కార్యక్రమంలో బీరోలు గ్రామ సర్పంచ్ వంచర్ల అలివేలమ్మ, ఎంపీటీసీ ఏనుగుల మాలతీ శ్రీధర్, వైస్ ఎంపీపీ బుద్ధ వంశీకృష్ణ, టిఆర్ఎస్ నాయకులు వంచర్ల సత్యనారాయణరెడ్డి ఉన్నారు