Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం కార్పొరేషన్:
సీపీఐ(ఎం) సానుభూతిపరుడు మువ్వా రంగయ్య (86) బుధవారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. గుండెనొప్పితో బాధపడుతున్న ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ తరలిస్తుండగా మార్గంమధ్యలో చనిపోయారు. పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి గ్రామానికి చెందిన రంగయ్య మొదటి నుంచి మార్క్సిస్టు భావాజాలంతో ఉంటూ పార్టీ అభివృద్ధికి తనవంతు తోడ్పాటునందించారు. రంగయ్య- పద్మావతి దంపతులకు నలుగురు సంతానం. కుమారులు వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు (క్రాంతి), లక్ష్మీకాంతారావుతో పాటు కుమార్తె వాణి ఉన్నారు. రంగయ్య రెండో కుమారుడు క్రాంతి శ్రీనివాసరావు సాహితీవేత్తగా, రచయిత, కవిగా సుపరిచితులు. మువ్వా రంగయ్య మృతికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు తదితరులు సంతాపం తెలిపారు.