Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లి లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్నగర్లో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో స్థానికులు సుమారు 100 మందికి పైగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. కంటి ఆపరేషన్ అవసరమున్న వారికి వైరాలోని తమ ఆసుపత్రిలో కంటి శస్త్రచికిత్సలు జరుపనున్నట్లు నేత్ర వైద్యులు తెలిపారు. వైరాకు చెందిన నేత్ర వైద్యశాల వైద్య బృందంచే జరిగిన ఈ శిబిరంలో లయన్స్క్లబ్ బాధ్యులు దారా కృష్ణారావు, జంగా సత్యనారాయణ, వార్డు కౌన్సిలర్ మేకల భవాని నరసింహారావు, కంటి వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు.