Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని
నవతెలంగాణ-మధిర
ఐక్య ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు అన్నారు. రాయపట్నం గ్రామంలో తాళ్లూరి కృష్ణమూర్తినగర్లో బుధవారం సీపీఐ(ఎం) మధిర రూరల్ ఏడో మహాసభ జరిగింది. ఈ సభలో పోతినేని మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. యువకులకు ఉపాధి లేక, రైతులకు గిట్టుబాటు ధర లేక, కూలీలు పెరిగిన నిత్యావసరాల ధరలతో అనేక సమస్యలు పడుతున్నారని, ప్రజలంతా ఐక్యంగా ఉద్యమాలు నిర్వహించడం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ప్రజా సమస్యలపై పోరాడేందుకు సిపిఎం నిత్యం ముందు ఉంటుందని తెలిపారు. పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల కోసం పని చేస్తుంది తప్ప ప్రజల కోసం పని చేయటం లేదని విమర్శించారు. దేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని అన్ని వర్గాల ప్రజలు బలపరచాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పార్టీ మండల కార్యదర్శిగా మందా సైదులను ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు. మండల కమిటీ సభ్యులుగా మద్దాల మద్దాల ప్రభాకర్, ఓట్ల శంకర్రావు నాయుడు, శ్రీరాములుతో పాటు కొత్త సభ్యులుగా వీరాచారి, తేజ నాగేశ్వరరావులతో పాటు 14 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ మహాసభలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు బండి రమేష్, మాదినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు.