Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన
ఎమ్మెల్యే, కలెక్టర్, జెడ్పీ చైర్మెన్
నవతెలంగాణ-ములకలపల్లి
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరావు తెలిపారు. గురువారం మండలంలోని పూసుగూడెం వ్యవసాయ క్లస్టర్లో రూ.22 లక్షలు, రాజుపేట గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించిన రైతువేదికలు, పొగళ్లపల్లి గ్రామంలో రూ.157.25 లక్షల వ్యయంతో నిర్మించిన 25 రెండు పడక గదుల ఇండ్లు, రాజాపురం, జగన్నాధపురం, నల్లముడి, గుట్టగూడెం గ్రామాల్లో రూ.32 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాలను జడ్బీ చైర్మెన్ కోరం కనకయ్య, కలెక్టర్ అనుదీప్తో కలిసి ఎమ్మెల్యే మెచ్చా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలలో ఆయన మాట్లాడుతూ రైతులను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. పేద ప్రజలకు అభివద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలులో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తూ ఇతర రాష్ట్రాలకు దిక్సూనిగా ఉన్నదని చెప్పారు.
అనంతరం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య మాట్లాడుతూ వ్యసాయానికి సంబంధించి రైతులు ఏ ఏ పంటలు సాగు చేయాలనే అంశంపై చర్చలు నిర్వహించడానికి రైతు వేదికలు ఎంతో ఉపయోగపడుతున్నాయని చెప్పారు.
అనంతరం కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ బాధసాటి పంటల సాగు ద్వారా రైతులు సంపన్నులు కావాలని తెలిపారు. పండుగ వాతావరణంలో రైతుల సమక్షంలో రైతువేదికలు ప్రారంభించు కోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. ప్రభుత్వం జిల్లాలోని 67 వ్యవసాయ కస్టర్లులో రైతు వేదికలు నిర్మించినట్లు చెప్పారు. ప్రతి రైతు వేదికకు ప్రభుత్వం రూ.22 లక్షల కేటాయించిందని, గ్రామ పంచాయతీలు, దాతలు సహాకారంతో రైతు వేదికలను సుందరంగా నిర్మించామని, రైతులు సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులు సాధించాలని ఆయన సూచించారు. అశ్వారావుపేట నియోజకవర్గం పామా యిల్ పంటల సాగుకు పేరెన్నిక కన్నదని అశ్వారా వుపేట, దమ్మపేట మండలాల్లో పామాయిల్ పంట సాగు పెద్ద ఎత్తున చేపట్టారని, అదేవిధంగా ముల్కల పల్లి మండలంలో కూడా రైతులు పెద్ద ఎత్తున పామా యిల్ సాగు చేపట్టి అధిక లాభాలు గడించాలని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి అభిమన్యుడు, పీఆర్ ఈఈ సుధాకర్, జడ్పీ సీఈఓ విద్యాలత, రైతు సమన్వయ సమితి సభ్యులు, ముల్కలపల్లి, దమ్మపేట జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.