Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పోతినేని సుదర్శన్
నవతెలంగాణ-సుజాతనగర్
పోడు సాగు దారులకు తక్షణమే పట్టాలు ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా గిరిజనులు పోడు భూములు సాగు చేసుకుంటుంటే వారి నుంచి లాక్కోవటం సబబు కాదని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తున్నారని అన్నారు. పోడు సాగు దారుల జోలికి వస్తే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కాసాని అయిలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, జిల్లా కమిటీ సభ్యులు కె.ధర్మ, మండల కార్యదర్శి రమేష్, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.