Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూలూరుపాడు
పేదలు, వ్యవసాయ కార్మికల, రైతు, కార్మిక వర్గాల ప్రజల ప్రయోజనాల కోసం పోరాడిన కామ్రేడ్ యాసా కొండలరావు సెప్టెంబర్ 28 రాత్రి గుండె పోటుతో అకస్మాత్తుగా మరణించారు. ఈ సందర్భంగా ఆదివారం మండల నాయకులు బానోత్ ధర్మా పార్టీ కార్యాలయం పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి, మాట్లాడారు. నేడు యాసా కొండలరావు సంస్మరణ సభ యాల్లంకి గార్డెన్లో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కొండలరావు స్మారక స్థూప ఆవిష్కరణ, సంస్మరణ సభ ఉదయం 10 గంటలకు మండల కేంద్రంలో జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు గార్లపాటి వెంకటి, భానోత్ మధు, పి.వెంకటేశ్వర్లు, యాసా నరేష్, పవన్, అభి మిత్ర, వెంకటేశ్వర్లు, సురేష్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.