Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మీ-సేవ కేంద్రాల్లో ఉచితంగా ఆన్లైన్
అ కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్త వృద్ధాప్య పింఛన్ల మంజూరు కోసం మీ-సేవ కేంద్రాల ద్వారా అర్హులైన వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ కోరారు. వృద్ధాప్య పింఛన్లు కోసం 57 ఏండ్లు నిండిన వారి నుంచి పింఛన్ల దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 11వ తేదీ సోమవారం నుంచి ఈ నెలాఖరు వరకు అర్హులు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. మీ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు ఆయన వివరించారు. వృద్ధాప్య పింఛనుకు మీ-సేవ కేంద్రాల్లో ఉచితంగా దరఖాస్తు చేసుకునే ఆవకాశం ప్రభుత్వం కల్పించిందన్నారు. దరఖాస్తు దారులు నుండి ఎటువంటి రుసుము వసూలు చేయొద్దని, మీ-సేవా కేంద్రాల నిర్వాహకులకు ప్రభుత్వమే రుసుము చెల్లింపు చేస్తుందని, ప్రభుత్వ నిబందనలు ఉల్లంఘించి ఎవరైనా వృద్ధాప్య పింఛను దరఖాస్తు దారుల నుండి రుసుము వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. అన్ని మీ-సేవా కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ ఆదేశాలు పాటించు విదంగా చర్యలు చేపట్టాలని ఈడీఎంను ఆదేశించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ననుసరించి 57 ఏండ్లు నిండిన వారు దరఖాస్తు చేయుటకు అర్హులని చెప్పారు. దరఖాస్తు చేయుటకు ఆధార్, ఎన్నికల గుర్తింపు కార్డు, ఆహార భద్రత కార్డు వెంట తెచ్చుకోవాలని, దరఖాస్తు తదుపరి ప్రింట్ కాపీని సంబంధిత ఎంపీడీఓ కార్యాలయంలో అందచేయాలని కలెక్టర్ కోరారు.