Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కామేపల్లి
అప్పుల బాధతో రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ముచ్చర్ల గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
ముచ్చర్ల గ్రామానికి చెందిన బత్తుల వీరన్న(40) గత సంవత్సరం మిర్చి, పత్తి సాగు చేశాడు. పెట్టుబడుల కోసం అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చాడు. ప్రకృతి వైపరిత్యాలతో పంట దెబ్బతినడంతో తెచ్చిన అప్పు తీర్చలేకపోయాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.