Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రజా సమస్యను పరిష్కరించాలని తెలియచేస్తూ ప్రజావాణిలో ఇచ్చిన ప్రతి దరఖాస్తును పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను పరిష్కరించేందుకు సంబంధత శాఖల అధికారులకు ఎండార్స్ చేయడం జరిగిందని, అట్టి ప్రజా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన చేసి పిర్యాదు దారునికి లిఖితపూర్వకంగా తెలిచేయాలని చెప్పారు. కాలయాపన చేయక సమస్య పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్ఓ అశోకచక్రవర్తి, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, డిపిఓ రమాకాంత్, సిఈఓ విద్యాలత తదితరులు పాల్గొన్నారు.