Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ కథనంతో ముందుకొచ్చిన దాతలు
నవతెలంగాణ- బోనకల్
చదువుల పుత్రుడు కీర్తి కుమార్కు తాసిల్దార్ రావూరి రాధిక తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దళిత గిరిజన బహుజన సాధికారత సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గంధం పుల్లయ్య పది వేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు. ఈ సహాయాన్ని తాసిల్దారు చేతుల మీదుగా కీర్తి కుమార్కు అందజేశారు. ఈనెల 7వ తేదీన నవతెలంగాణ దినపత్రికలో సరస్వతీ పుత్రుడుని వెంటాడుతున్న ఆర్థిక సమస్య కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి దళిత గిరిజన బహుజన సాధికారిక సంస్థ స్పందించింది. కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పైడిపల్లి కిషోర్, బోనకల్ గ్రామానికి చెందిన బీజేపీ యువ నేత ఎన్ఆర్ఐ బీపీ నాయక్, యూత్ కాంగ్రెస్ నేత భూక్యా భద్రు నాయక్ తమ వంతుగా ఆర్థిక సహాయం అందజేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. కార్యక్రమంలో దళిత, గిరిజన బహుజన సాధికారిక సంస్థ ప్రతినిధులు, తహశీల్దార్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.