Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య
నవతెలంగాణ-దమ్మపేట
సీపీఐ(ఎం) మండల కార్యాలయం సుందరయ్య భవనంలో దొడ్డా లకిëనారాయణ అధ్యక్షతన మండల కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ పోడు భూములకు వెంటనే పట్టాదారు పాసుపుస్తకాలను ఇవ్వాలని, కెసిఆర్ గారడీ మాయ మాటలు వదిలిపెట్టి 2005 సం|| నుండి సాగులో ఉన్న పోడు రైతులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడు రైతులుపై పెట్టిన కేసులు అన్నింటిని ఎత్తివేయాలన్నారు. పెంచిన గ్యాసు, పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలన్నారు. ఉత్తప్రదేశ్ లోని లఖింపూర్ ఘేర్ ఘటన బాధ్యుడైన కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఐలయ్య జిల్లా సెక్రటరీ మెంబర్ కొక్కెరపాటి పుల్లయ్య, సీనియర్ జిల్లా నాయకులు మోరంపూడి పుల్లారావు, జిల్లా కమిటీ పిట్టల అర్జున్, దమ్మపేట మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు, పిల్లినాయుడు, కొప్పుల శ్రీను, యండ్రాతి అప్పారావు, రావుల శోభన్బాబు, పెనుబల్లి నానారావు, కొల్కిపోగు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.