Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
మండలంలోని మేడిదపల్లి గ్రామం సీపీఐ(ఎం) సీనియర్ సభ్యులు ఎర్ర పాపిరెడ్డి కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం మేడిదపల్లి గ్రామంలో ఎర్ర పాపిరెడ్డి ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించారు. తమ్మినేనితో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, సిపిఎం మండల కమిటీ సభ్యులు బందారపు సైదులు, రావుల వెంకట్రామిరెడ్డి, రావుల కృష్ణారెడ్డి పాల్గొన్నారు.