Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. పునరుద్ధరించబడిన వైరా ఏసీపీ క్యాంపు కార్యాలయాన్ని శనివారం పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ ప్రారంభించారు. అనంతరం వైరా డివిజన్ పోలీస్ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా సైబర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అంశాలపై గ్రామస్ధాయి నుండి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని పోలీస్ అధికారులకు సూచించారు. ఇప్పటికే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి తొలిసారిగా జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన ''సైబర్ దోస్తు'' కు పోలీస్ శాఖ శ్రీకారం చుట్టిందని తెలిపారు. అనంతరం ఏసీపీ కార్యాలయం ప్రాంగణంలో మొక్కలను పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్, అడిషనల్ ఏఎస్పీ స్నేహ మెహ్రా నాటారు. ఈ కార్యక్రమంలో సిఐలు వసంతకుమార్, మురళీ, ఎస్సైలు ఉన్నారు.