Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
బాణాపురంలో జరిగిన ప్రమాదంలో నలుగురు మతి చెందడం తన మనస్సును కలచివేసిందని. టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. దుర్గాదేవి నిమజ్ఞన వేడుకలు ముగించుకొని తిరిగివస్తూ బాణాపురం వద్ద ట్రాక్టర్ బోల్తా పడడంతో మతి చెందిన కుటుంబాలను జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్తో కలిసి ఎంపీ నామ నాగేశ్వరరావు సోమవారం పరామర్శించారు. కమలాపురం గ్రామానికి వెళ్లి మృతి చెందిన ములకపల్లి ఉమ, అవసాని ఉపేందర్, యలగొండ స్వామి, చూడబోయిన నాగరాజు కుటుంబాలను ఎంపీ నామ పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఎంపీ నామ వెంట రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు(ఎన్వీ), టీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు మద్దినేని దేవి స్వర్ణకుమారి, ఎంపీపీ సామినేని హరిప్రసాద్, జడ్పీటీసీ పసుపులేటి దుర్గా, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, మండల రైతుబంధు కన్వీనర్ పోట్ల ప్రసాద్, టీఆర్ఎస్ మండల కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.