Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెనుబల్లి
ఇటీవల మృతి చెందిన చెందిన మండలంలోని కొత్త లంకపల్లి గ్రామానికి చెందిన మువ్వా రంగయ్య పెద్దకర్మలో టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్తో కలిసి మువ్వా రంగయ్య దశదిన పెద్దకర్మలో ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొని నివాళ్లు అర్పించారు. మృతుడి కుమారుడు మువ్వా శ్రీనివాసరావు(క్రాంతి శ్రీనివాసరావు)ను పరామర్శించి ఓదార్చారు. ఎంపీ నామ వెంట రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు(ఎన్వీ), టీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబీ స్వర్ణకుమారి, డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజరుబాబు, చిత్తారు సింహాద్రి, నామ సేవా సమితి నాయకులు పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, రేగళ్ల కృష్ణప్రసాద్ తదితరులు ఉన్నారు