Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- రఘునాథపాలెం
దసరా రోజున గృహప్రవేశాలు చేసిన టేకులపల్లి డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాలలో మౌళిక వసతులను కలెక్టర్ వి.పి.గౌతమ్ సోమవారం పరిశీలించారు. డబుల్ బెడ్రూమ్ గృహ నివాసితులతో మాట్లాడారు. గహా సముదాయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, గిరిజన సహకార సంస్థ, సూపర్ బజార్లను కలెక్టర్ పరిశీలించారు. నివాసితులకు అవసరమైన అన్ని సదుపాయాలను సమకూర్చాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్అండ్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు శ్యాంప్రసాద్, ఇ.ఇ ఐ.డి.సి రవీందర్, స్పెషల్ ఆఫీసర్ విజయకుమారి, అర్భన్ తహశీల్దారు శైలజ తదితరులు పాల్గొన్నారు.