Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
పాలేరులో ఎర్రజెండా ఎగరటం ఖాయమని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మండలంలోని తెల్దారుపల్లి గ్రామంలో మంగళవారం కోటి అమరయ్య నగర్లో మూడ్ లలితమ్మ, వజ్జా వెంకయ్య ప్రాంగణంలో సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండల 8వ మహాసభ పార్టీ ఖమ్మం రూరల్ మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అమరవీరుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన జెండాను తమ్మినేని ఎగురవేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కేసీఆర్, మోడీలకు తగు రీతిలో బుద్ధి చెప్పడం ఖాయం అన్నారు. ఖమ్మం రూరల్ మండలం కమ్యూనిస్టుల కంచుకోట అని ఎన్ని అవాంతరాలు ఎదురైన మళ్ళీ పూర్వ వైభవం రావడం ఖాయమన్నారు. ఎన్ని శక్తుల ఏకం అయిన తెల్దారుపల్లి లో ఎర్రజెండాకు ఎదురులే దన్నారు. భవిష్యత్ అంతా ఎర్రజెండాదే అని తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు మాట్లాడుతూ కేసీఆర్, మోడీలు మాయమాటలతో ఏడు సంవత్సరాలు పాలన సాగించారని వారి మాయమాటలు ఇక ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. గ్రామాలే ఉద్యమ కేంద్రాలుగా ఉండాలన్నారు. ఉద్యమాల్లో యువత ప్రధాన పాత్ర పోషించాలని తెలిపారు.
అనంతరం సీపీఎం ఖమ్మం రూరల్ మండల కార్యదర్శిగా నండ్ర ప్రసాద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, భూక్య వీరభద్రం, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు బండి పద్మ, సీపీఎం నాయకులు ఉరడీ సుదర్శన్ రెడ్డి, తుమ్మల శ్రీనివాసరావు, బందెల వెంకయ్య, పి.మోహన్ రావు, బత్తినేని వెంకటేశ్వరరావు, మాంమిడ్ల సంజీవ రెడ్డి, తమ్మినేని కోటేశ్వరరావు, తెల్దారుపల్లి సర్పంచ్ సిద్దినేని కోటయ్య, మద్దులపల్లి సర్పంచ్ కర్లపూడి సుభద్ర, 35వ డివిజన్ కార్పొరేటర్ యల్లంపల్లి వెంకట్రావ్, తిరుమలయపాలెం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, సీపీఐ(ఎం) నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, పొన్నెకంటి సంగయ్య, ఏటుకూరి ప్రసాద్ రావు, నందిగామ కృష్ణ, సిలివేరు బాబు, పొన్నం వెంకట రమణ, కొప్పుల రామయ్య, జాలారు సంగయ్య, అంగిరేకుల నర్సయ్య, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్, చింతల రమేష్, ఐద్వా మండల కార్యదర్శి పెండ్యాల సుమతి, తమ్మినేని కమలమ్మ, ఆంద్రాబ్యాంక్ సొసైటీ వైస్ చైర్మన్ తమ్మినేని విజయలక్ష్మి, ఏదులాపురం సొసైటీ వైస్ చైర్మన్ ఉరడీ హైమావతి, యామిని ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.