Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
వికలాంగుల పెన్షన్ మూడు వేల నుండి ఆరు వేల రూపాయలకు పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బొజ్జ జీవరత్నం డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మంలో ని టిఎన్జీవో ఫంక్షన్ హాల్లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఖమ్మం జిల్లా ముఖ్య కార్యకర్తల సదస్సు జరిగింది. ఈ సదస్సులో అయన మాట్లాడుతూ వికలాంగులు బంధువు ప్రకటించాలని, ప్రతి వికలాంగుడికి ఇల్లు నిర్మాణం కోసం రూ.5 లక్షలు మంజూరు చేయాలని, ప్రతి సంవత్సరం బ్యాక్లాగ్ పోస్టులు ప్రకటించాలని, 2016 వికలాంగుల చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గడ్డం ఖాసిం, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు బచ్చలకూర వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.