Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ వీరయ్య
నవతెలంగాణ-దుమ్ముగూడెం
సారపాక కేంద్రంగా నడుస్తున్న ఐటీసీ బీపీఎల్ పరిశ్రమను ఐటీడీఏ పరిధిలోకి తీసుకు రావాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ సోందె వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రామచంద్రునిపేట గ్రామంలో కల్లూరి లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. సారపాక కేంద్రంగా నడుస్తున్న ఐటీసీ పరిశ్రమ బీపీఎల్ యాజమాన్యం గిరిజన చట్టాలను గౌరవించడం లేదన్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం స్థానికంగా ఉన్న గిరిజనులకే ఉపాది ఉద్యోగ అవాకాశాలు కల్పించకుండా ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల వారికి ప్రాదాన్యత ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. భూమి, నీరు, శ్రమ ఈ ప్రాంత గిరిజనులదేనని ఆయన అన్నారు. నవంబరు 8వ తేదీన ఐటీసీ మెయిన్ గేట్ నుండి భద్రాచలం ఐటీడీఏ వరకు తలపెట్టిన ఛలో భద్రాచలం కార్యక్రమంలో ఆదివాసీ నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కల్లూరి రాజమ్మ, కారం నర్సింహారావు, మల్లూరు, గోపి, రాజేష్, నాగేష్, శ్రీను, రమేష్ తదితరులు పాల్గొన్నారు.