Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోనకల్
రైతులకు నష్టం జరిగే రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని సిపిఎం మండల కమిటీ సభ్యులు కిలారి సురేష్ కోరారు. మండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామంలో సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను సోమవారం రాత్రి దగ్ధం చేశారు. తొలుత కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను గ్రామంలో ఊరేగించారు. అనంతరం బొడ్రాయి సెంటర్ లో దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బోయినపల్లి పున్నయ్య, బోయినపల్లి సూర్యనారాయణ, తోటకూర మాధవరావు తదితరులు పాల్గొన్నారు.
తిరుమలాయపాలెం : బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో జూపెడ -బీరోలు రహదారిపై నరేంద్ర మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. మండలంలోని జూపెడ, బీరోలు గ్రామాలలో రైతుల పోరాటాలకు మద్దతుగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, రైతు సంఘం మండల అధ్యక్షులు తుళ్లూరు నాగేశ్వరావు, సిపిఎం మండల కమిటీ సభ్యులు అంగిరేకుల నర్సయ్య, దోనెపల్లి వెంకన్న, కోట ఉపేందర్ రెడ్డి, గోపోజు రవి, శాఖ కార్యదర్శులు సిద్ధుల వెంకన్న, కోడి లింగయ్య, సభ్యులు మండాది యశోద, సౌడం సుశీల, గడ్డం రవీందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, మాట్టే గురువయ్య పాల్గొన్నారు.
లఖింపూర్ రైతులకి కొవ్వొత్తుల నివాళులు
గాంధీచౌక్ : లఖింపూర్ రైతులకు కొవ్వొత్తుల నివాళులర్పిస్తూ సిపిఎం 30వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సుందరయ్య పార్క్ వద్ద అమరవీరుల రైతులకు జోహార్లు అర్పిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ 30 డివిజన్ కార్యదర్శి షేక్ హిమామ్, యర్రా. శ్రీనివాసరావు, సీపీఐ(ఎం) ఖమ్మం 3టౌన్ కార్యదర్శి భూక్య శ్రీనివాస్, సిపిఎం సీనియర్ నాయకులు బండారు యాకయ్య, సిపిఎం ఖమ్మం త్రీటౌన్ నాయకులు పత్తిపాక నాగ సులోచన, శీలం వీరబాబు పాల్గొన్నారు.
ఎర్రుపాలెం : మండల కేంద్రమైన ఎర్రుపాలెం రింగ్ సెంటర్ నందు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాల ను రద్దు చేయాలని మోడీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య, సగుర్తి సంజీవ రావు, నాగులవంచ వెంకట రామయ్య, దేవరకొండ రామకృష్ణ, కోటి సుబ్బారెడ్డి, రాధాకృష్ణ, దూదిగం బసవయ్య, పాల్గొన్నారు.
పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి
ఎర్రుపాలెం : సామాన్య ప్రజలపై పెను భారాన్ని మోపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని మండల యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకుల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధిర నియోజకవర్గం యువజ న ప్రధాన కార్యదర్శి దేవరకొండ రాజీవ్ గాంధీ, గూడేటి సతీష్, పత్తిపాటి కోటేశ్వరరావు, సంపత్ కుమా ర్, దేవరకొండ బోసు, రాజేష్, లు పాల్గొన్నారు.