Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్..
నవతెలంగాణ-చింతకాని
అభినవ అంబేద్కర్ సీఎం కేసీఆర్ అని, నిరుపేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వ ఫలాలు ఉన్నాయని, దళితసాధికారిత సీఎం కేసీఆర్తోనే సాధ్యమని ఖమ్మం జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. చింతకాని కేజేఆర్ గార్డెన్స్లో టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావుతో కలిసి కమల్రాజు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి మొదటి విడతగా చింతకాని మండలానికి రూ.100కోట్లు ప్రకటించడం హర్షణీయమని, సీఎం కేసీఆర్ దళితబాంధవుడని, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని వారు కొనియాడారు. దళితబంధు ప్రకటనతో టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ పెరిగిందని అన్నారు.అనంతరం కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల, గ్రామశాఖల నాయకులు, ప్రజాప్రతినిధులు, దళితసంఘాల నాయకులు, పలు గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజా ప్రతినిధులు, అనుబంధసంఘాల నాయకులు పాల్గొన్నారు.