Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంపీ నామా నాగేశ్వరరావు
నవతెలంగాణ-వైరా
టీఆర్ఎస్ పార్టీ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని, అందుకు కారణం అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కెసిఆర్ అని టిఆర్ఎస్ పార్లమెంటరీ నాయకులు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే లావుడ్య రాములు నాయక్ అధ్యక్షతన జరిగిన వైరా నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో నామా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ నెల 25న హైదరాబాద్ లో జరగనున్న పార్టీ ప్లీనరీ సన్నాహక సమావేశంను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ప్రతి ఇంటికి అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని, తెలంగాణ అభివృద్ధిపై తాను పార్లమెంటులో మాట్లాడుతున్నప్పుడు సభ్యులు అందరూ ఆసక్తిగా వింటారని అన్నారు. కెసిఆర్ నాయకత్వానికి అందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించాలని, రానున్న ఎన్నికలలో టీఆర్ఎస్కు అఖండ విజయం చేకూర్చాలని కోరారు. హైదరాబాద్లో జరిగే ప్లీనరీ, వరంగల్లో జరిగే ప్రజా గర్జన సభలను జయప్రదం చేయాలని అందుకు ప్రతి గులాబీ సైనికుడు స్వఛ్చందంగా తరలి రావాలని అన్నారు. ఈ సమావేశంలో మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మద్దినేని బేబీ స్వర్ణ కుమారి, వైరా మునిసిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వేంకటేశ్వర రావు, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మా రోశయ్య, ఏనుకూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ బూక్యా లాలు, ఆత్మా చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, ఎంపీపీలు పావని, సోని, శకుంతల, మధు, జడ్పిటిసి సభ్యులు కనకదుర్గ, జగన్ కళావతి బుజ్జి, పోట్ల కవిత, పీఎసిఎస్ చైర్మన్లు చేరుకుమల్లి రవి, దిగ్గినేని శ్రీనివాసరావు, పార్టీ మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, చౌడం నరసింహారావు, బానోత్ సురేష్, యండ్రా ప్రగడ చిరంజీవి, మిట్ట పల్లి నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.