Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-ముదిగొండ
రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ గత పది నెలల నుండి ఢిల్లీలో రైతులు ప్రాణాలొడ్డి ఆందోళన చేస్తున్న ప్రధాన మంత్రి మోడీ పట్టించుకోవడంలేదని రైతుల ఉసురు మోడీకి తప్పక తగులుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు జోస్యం చెప్పారు. ముదిగొండ మచ్చా వీరయ్య భవనంలో మంగళవారం సీపీఐ(ఎం) మండల కమిటీ సమావేశం ఆ పార్టీ మండల కమిటీ సభ్యులు యండ్రాపల్లి రవికుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని పొన్నం డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ ప్రజలను మాటలతో మభ్యపెట్టి గారడి చేస్తూ జమ్మికులతో పాలన చేస్తూ ఉపఎన్నికల రాగం తీస్తూ కొత్త పథకాలకు తెరలేపుతున్నారన్నారు. సమాజ గమనానికి ప్రపంచ ప్రజాశక్తికి కమ్యూనిస్టు సిద్ధాంతమే అనుచరనీయమన్నారు. బూర్జువా శక్తులను తరిమి కొట్టి పేదల రాజ్యాన్ని తీసుకువచ్చే సత్తా ఎర్రజెండా వామపక్ష శక్తులదేనని పొన్నం వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు బండి పద్మ, మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, మండల మాజీ కార్యదర్శి వాసిరెడ్డి వరప్రసాద్, నాయకులు టీఎస్ కళ్యాణ్, వేల్పుల భద్రయ్య, మందరపు వెంకన్న, కోలేటి ఉపేందర్, మంకెన దామోదర్, ఇరుకు నాగేశ్వరరావు, కోలేటి అరుణ, సామినేని రామారావు, మందరపు పద్మ, పి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.