Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కమ్యూనిస్టులు బలపడతారు
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి
నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల ఉసురు తీస్తుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఖమ్మం మంచికంటి భవనంలో ఖమ్మం అర్బన్ మండలం 8వ మహాసభ ఎర్రబోయిన ఉపేందర్, గుర్రం కృష్ణయ్య, గద్దల రత్తమ్మ, మొక్కపాటి నాగమణి అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకు వచ్చి వ్యవసాయ రంగాన్ని అంబానీ, అదానీలకు కట్టబెట్టాలని చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దోపిడీ పాలన కొనసాగుతోందని నరేంద్ర మోడీ, కేసీఆర్ ఇద్దరూ సంపన్న వర్గాలకు ఊడిగం చేస్తున్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా కమ్యూనిస్టులు బలపడుతున్నారన్నారు. భవిష్యత్తులో ప్రత్యామ్నాయం కమ్యూనిస్టులే అన్నారు. తొలుత మహాసభ జెండాను సీనియర్ గద్దల పెంటయ్య ఆవిష్కరించారు. ఈ మహాసభలో రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు ఎర్ర శ్రీనివాసరావు, టి.విష్ణు వర్ధన్, మెరుగు సత్యనారాయణ, టి. లింగయ్య, నాయకులు ముదాం శ్రీనివాసరావు, భూక్య శ్రీను, ఎస్కె నాగులు మీరా, ముమ్మడి పుష్పవతి, పద్మ పాల్గొన్నారు.