Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్లూరు
టీబీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకుని మందులు వాడాలని టీబీ వ్యాధి నియంత్రణ సూపర్ వైజర్ వై.సురేష్ కోరారు. మంగళవారం మండల పరిధిలోని క్రిష్టయ్య బంజర గ్రామంలో మాట్లాడుతూ.. టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ సుబ్బారావు ఆదేశాల మేరకు, గ్రామాల్లో టీబీ వ్యాధిపై ఇంటింటి సర్వే నిర్వహించి 2025 కల్లా టీబీ నియంత్రణ లక్ష్యంగా పని చేస్తున్నమని పేర్కొన్నారు. టీబీ వ్యాధికి సంబంధించి పరీక్షలు మందులు పూర్తిగా ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. టీబీ వ్యాధి లక్షణాలు రెండు వారాలకు మించి దగ్గు, కళ్ళే రావటం, రాత్రి పూట చెమటలు పట్టడం, తరచు జ్వరం రావటం, ఆకలి లేకపోవటం, బరువు తగ్గడం ఉన్నవారు దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కళ్ళే నమూనాలు ఇచ్చినట్లు అయితే టీ-హబ్ వెహికిల్ ద్వారా ఖమ్మంలో సీబీనాట్ మిసషన్లో పరీక్షించి వారు ఇచ్చిన మొబైల్ నెంబర్ కి పరీక్ష ఫలితాలు పంపిస్తారని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో టీబీ నోడల్ పర్సన్ రామారావు, లాబ్ సూపర్ వైజర్ ఆర్.సంజీవ్ కుమార్, ఆశ రాణి సిబ్బంది పాల్గొన్నారు.