Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కారేపల్లి : ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు కారేపల్లి మండలం మాధారంనకు చెందిన తన్నీరు సత్యనారాయణ (103) మంగళవారం మృతి చెందారు. ఇటీవల అస్వస్ధత కు గురైన సత్యనారా యణను చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రిలో చేర్చగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భార్య గతంలోనే మృతి చెందింది. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని యువకులను చైతన్యం పర్చటమే కాక పలు ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు. మాధారంలో ఏర్పాటు చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ అనుబంధ పరిశ్రమ డోలమైట్ మైన్స్ కింద భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిగేలా యాజమాన్యంపై జరిపిన పోరాటంలో ను రైతు పక్షాన పాల్గొన్నారు. తన్నీరు సత్యనారాయణ మృతదేహాన్ని మాధారం సర్పంచ్ అజ్మీర నరేష్, ఉపసర్పంచ్ భాగం వెంకటప్పారావులు పూలమాలలు వేసి నివాళ్లు ఆర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుడు తన్నీరు మృతి వార్తను తెలుసుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ మాజీ ఎంపీ పొంగులేటి క్యాంపు ఇంచార్జీ దయాకరెర్డ్డి, ఎంపీటీసీ భాగం రూపా నాగేశ్వరరావులు ఫోన్లో ఆయన కుమారులైన తన్నీరు వెంకన్న, సత్యనారాయణలను పరామర్శించి సానుభూతిని తెలిపారు.