Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సత్తుపల్లి
దళితుల అభివృద్ధి దిశగా అడుగులు వేయడం మతపార్టీ బీజేపీకి సుతారము ఇష్టం లేదని, అందుకే దళితబంధు పథకంపై ఈసీకి ఫిర్యాదుకు చేసి ఆపుచేయించి సంబరాలు చేసుకుంటు న్నారని సత్తుపల్లి నియోజకవర్గ దళిత ప్రజా ప్రతినిధులు వేంసూరు, కల్లూరు ఎంపీపీలు పగుటకల వెంకటేశ్వరరావు, బీరవల్లి రఘు మండిపడ్డారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే సండ్ర క్యాంపు కార్యాలయంలో వారు విలేకర్లతో మాట్లాడారు. దళితబంధు పథకం అనేది ఒక్క హుజురాబాద్ వరకే పరిమితం కాదన్నారు. ఎన్నికల ఉప ఎన్నికలకు ముందే అసెంబ్లీలో తీర్మానం చేశారనితెలిపారు. క్రమేపీ ఆ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరుగుతుందని వారు స్పష్టం చేశారు. బీజేపీ పన్నాగాలను దళిత సమాజం గమనిస్తూనే ఉందన్నారు. హుజరాబాద్ ఎన్నికల్లో ఈటలకు దళితులంత ఆఏకమై గుణపాఠం చెప్పడానికి కసితో ఉన్నారన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు అద్దంకి అనిల్కుమార్, గుండ్ర రాఘవేంద్ర, సర్పంచుల పద్మ, రమాదేవి, టీఆర్ఎస్ నాయకులు కాంతారావు పాల్గొన్నారు.