Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుజాతనగర్
సినీ నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని జీఎంపీఎస్ నాయ కులు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో పిటీషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా గొర్రెల మేకల సంఘం జిల్లా అధ్యక్షులు కాట్రాల తిరుపతి రావు మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన ''మా'' ఎన్నికలలో ఘర్షణలు చోటు చేసుకున్నప్పుడు ఆయన ''ప్రతి ఒక్కరూ చూస్తున్నారు గొర్రెలు కాసుకునే వారి దగ్గర కూడా సెల్ఫోన్లు ఉన్నాయని' అనడం గొర్రెల కాపరుల ఆత్మగౌరవాన్ని వృత్తిని కించపరచటం అని అన్నారు. మోహన్ బాబుపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉడుగుల శ్రీకాంత్, వీర్ల సత్యం, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
బూర్గంపాడు : గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం సీనియర్ నటుడు మోహన్ బాబుపై కేసు నమోదు చేయాలని ఎస్ఐ జితేందర్కు గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం అధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కలికినేని తీరీష్, సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బాసినబోయిన గంగరాజు, రాము, లాలయ్య పాల్గొన్నారు.