Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖమ్మం : జిల్లాలోని నాలుగు విడతల డియర్ నెస్ రిలీఫ్ వెంటనే విడుదల చేయాలని ఆల్ పెన్సనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మచ్చ రంగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఖమ్మంలోని మంచికంటి భవన్లో ఎల్ గోపీచంద్ అధ్యక్షతన సమావేశం జరిగింది. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెన్షనర్ల పిఆర్సి బకాయిలను 36 వాయిదాలు చెల్లిస్తామని ఆరు నెలలు గడుస్తున్నా ప్రారంభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్యాణం నాగేశ్వరరావు, వాసిరెడ్డి మల్లికార్జునరావు, బి.భాస్కర్రావు, భాస్కర్రెడ్డి, శ్రీధర్, ఝాన్సీ, అలి ఖాన్, గణపతి, పిల్లలమర్రి, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.